హైదరాబాద్, ఫిబ్రవరి26 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకులాల విద్యార్థుల ఆర్ట్ ఎగ్జిబిషన్ను మంగళవారం నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు గురుకులాల సొసైటీ సెక్రటరీ ఆయేషా మస్రత్ ఖానం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ మాదపూర్లోని కావూరిహిల్స్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలోని ఎంపీసీసీ హాల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ కొనసాగనున్నదని వెల్లడించారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.