హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సైబర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని కోర్టు స్పష్టం చేసింది. సునీల్కు పోలీసులు ఇచ్చిన 41ఏ నోటీసును రద్దు చేయాలని ఆయన తరఫు లాయర్ వాదించారు.