పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో 29 ఎకరాల్లో మాడ్రన్ పోలీసు పాలనా భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 8న మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పర్యవేక్షణలో రూ.38.50 కోట్ల వ్యయంతో 59 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. జీప్లస్-2 పద్ధతిలో పోలీస్ కమిషనరేట్ను నిర్మించారు.