హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): పర్యావరణంపై స్ఫూర్తి ఉంటే ఆవిష్కరణలు చేపట్టవచ్చని మహబూబాబాద్కు చెందిన ఆటోడ్రైవర్ అంజి నిరూపించారు. ఆటోపై మొక్కలు పెంచి, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ దృష్టిని ఆకర్షించారు. ఎండ వేడిని తట్టుకునేందుకు వీలుగా ఆటోపై మొక్కలు పెంచుతూ ప్రయాణికులకు చల్లని ప్రయాణం అందిస్తున్నందుకు అంజికి ఎంపీ హ్యాట్సాఫ్ చెప్పారు. అంజికి ఉన్న పర్యావరణ స్ఫూర్తిని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు.