హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్)గా అసెస్మెంట్ పూర్తి అయిన వారికి నియామకపు పత్రాలు ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తాని యా మంగళవారం ఆదేశాలు జారీచేశారు. నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసి, అసెస్మెంట్ లో 70 మార్కులు సాధించినవారిని రెగ్యులరైజ్ చేస్తూ గ్రేడ్-4 గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా నియామకపు పత్రాలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. 70 మార్కు లు సాధించకుంటే మరో ఆరు నెలల సమయ ం ఇచ్చి, మరోసారి అసెస్ చేయాలని పేర్కొన్నారు.