హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తుశాఖలో ట్రాన్స్కో, జెన్ కో సంస్థలకు నూతన డైరెక్టర్లను నియమిస్తూ శనివారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్కోకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా సీ శ్రీనివాసరావును, డైరెక్టర్లుగా జీ నర్సింగ్రావు (ప్రాజెక్ట్స్), టీ జగత్రెడ్డి (ట్రాన్స్మిషన్), జే సూర్యప్రకాశ్ (లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్), బీ నర్సింగారావు (గ్రిడ్ ఆపరేషన్స్)ను నియమించారు.
జెన్స్కో డైరెక్టర్లుగా సీహెచ్ వెంకట్రాజం ( హైడల్), ఎం సచిదానందం (ప్రాజెక్ట్స్), ఎస్ అశోక్కుమార్ (హెచ్ఆర్), బీ లక్ష్మయ్య (థర్మల్), ఏ అజయ్ (సివిల్), డాక్టర్ టీఆర్కే రావు (కమర్షియల్ ఫ్యూయల్)ను నియమించారు. వీరు రెండేండ్లపాటు పదవుల్లో కొనసాగనున్నారు. ప్రభుత్వ అసవరాల రీత్యా మరో ఏడాది నుంచి రెండేండ్లపాటు వారి పదవీకాలన్ని పొడించే అవకాశం ఉన్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.