Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విభాగాల బీఈ కోర్సుల రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. విద్యార్థులు తమ మార్కు మెమోలను రెండు వారాల తరువాత నుంచి సంబంధిత కళాశాలల్లో తీసుకోవాలని సూచించారు.
ఈ కోర్సుల పరీక్షా ఫలితాలపై రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 13వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 15వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్ష జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్కు రూ.వెయ్యి చొప్పున చెల్లించి ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని పేర్కొన్నారు.