హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి సత్కారానికి అర్హులైన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అర్హులైన వారు ఈ నెల 12లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల సాధికారత సంస్థ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.