హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ) :వివేకానంద విదేశీ విద్యా పథకం(వీవోఈఎస్)కు, తెలంగాణ బ్రాహ్మిణ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల (బీఈఎస్టీ)కు అందించే ఆర్థిక సహాయానికి అర్హులైన అభ్యర్థులు శుక్రవారం నుంచి ఆగస్టు 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ డాక్టర్ కే వీ రమణాచారి ఒక ప్రకటనలో కోరారు.
వివరాలకు బ్రాహ్మణ పరిషత్తు వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.