హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలో సీజీఆర్ఎఫ్ (కన్జూమర్ గ్రీవెన్సెస్ రీడ్రెస్సల్ ఫోరం) చైర్పర్సన్ల నియామకానికి సంస్థ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థలో విద్యుత్తు వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు రెండు వేదికలను ఏర్పాటు చేసింది. సంస్థ పరిధిలో 15 జిల్లాలు ఉన్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలకు కలిపి ఒకటి, మిగతా జిల్లాలకు కలిపి మరొక సీజీఆర్ఎఫ్ను ఏర్పాటు చేసింది. వాటికి వేర్వేరుగా చైర్పర్సన్లను నియమించేందుకు ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. అర్హత కలిగిన వారు ఈ నెల 26లోగా ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, మూడేండ్ల కాల వ్యవధి ఉంటుందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.