హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
జూలై 30 వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగనున్నది. జూన్ 1 నుంచే ఫస్టియర్ విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.