హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రెండో విడత పీహెచ్డీ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అమృత విశ్వ విద్యాపీఠం తెలిపింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://amrita.edu/ PhD@2023 లింక్ ద్వారా ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పీజీలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నది.