హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 16 వరకు దరఖాస్తు గడువు ఉన్నది. ఏప్రిల్ 23న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రవేశ పరీక్ష జరగనున్నది. 2022-23 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్నవారు, ఓసీ, బీసీ విద్యార్థులైతే 9 ఏండ్లు పూర్తయ్యి, 11 ఏండ్ల వయసు దాటని వారు, ఎస్సీ, ఎస్టీలు 13 ఏండ్లు దాటకుండా, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలైతే రూ.1.50 లక్షలు, పట్టణాలైతే రూ.2 లక్షలు మించి ఉండరాదు. వివరాల కోసం విద్యార్థులు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 45678 నంబర్లో సంప్రదించాలని, www.tgcet.cgg.gov.in <http:// www.tgcet.cgg.gov.in>, వెబ్సైట్లను సందర్శించాలని సొసైటీ అధికారులు పేర్కొన్నారు.