Prajapalana | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలనలో ప్రజలకు సే వ అటుంచితే దరఖాస్తుదారుల జేబులకు చిల్లు లు పడ్డాయి. ఒక్కో వార్డులో నాలుగు కేంద్రా ల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని, ఒక రోజు ముందుగానే దరఖాస్తు ఫారాలను అందజేస్తామన్న జీహెచ్ఎంసీ అధికారులు.. క్షేత్రస్థాయిలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. ఒక్కో కేంద్రంలో వందల సంఖ్యలోనే దరఖా స్తు ఫారాలు అందజేయగా, తొలి రోజే వేల సంఖ్యలో దరఖాస్తుదారులు కేంద్రాలకు పోటెత్తారు. అరకొరగా తీసుకువచ్చిన కలర్ పేపర్లతో కూడిన దరఖాస్తులు ప్రతి కేంద్రంలో మొదటి గంటలోనే అయిపోవడంతో జిరాక్స్ కాపీలను పంపిణీ చేశారు. అవి కూడా అయిపోవడంతో జిరాక్స్ సెంటర్లకు వెళ్లి తీసుకోవాలని సిబ్బంది ప్రజలకు తెలియజేయడం కనిపించింది. ఇదే అదనుగా భావించిన కొందరు దళారులు ఒకో దరఖాస్తు ఫారాన్ని రూ.40-రూ.50 తీసుకుని ఇచ్చారు. మరోవైపు, దరఖాస్తుల కోసం మీసేవ, జిరాక్స్ సెంటర్ల వైపు ప్రజలు దారులు పట్టారు. సందట్లో సడేమియాలా మీసేవ సెంటర్ల నిర్వాహకులు, జిరాక్స్ సెంటర్లు, కొన్ని చోట్ల కిరణాషాపు యాజమానులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఒక్కో దరఖాస్తుకు రూ.50 నుంచి 100 వరకు దరఖాస్తుదారులు సమర్పించుకోవాల్సి వచ్చింది.
దరఖాస్తులు జిరాక్స్ సెంటర్లు, మీసేవ సెం టర్ల పంట పండించాయి. గ్యారెంటీ దరఖాస్తులకు రేషన్కార్డు, ఆధార్ పత్రాలు జతచేయాలని ప్రభుత్వం స్పష్టం చేయటంతో జిరాక్స్ సెంటర్ల వద్ద జనాలు క్యూకట్టారు. ప్రజాపాలన కౌంటర్ల వద్ద కంటే జిరాక్స్ సెంటర్లు, మీసేవ సెంటర్ల వద్దే దరఖాస్తుదారులు ఎక్కువగా కనిపించారు. దొరికిందే చాన్స్ అన్నట్టు నిర్వాహకులు ధరలు ఆమాంతం పెంచేసి దండుకున్నారు. ఒక్కో ప్రింట్కు రూ.20-రూ.40 వరకు దండుకున్న పరిస్థితి. చేసేదేం లేక దరఖాస్తుదారులు సమర్పించుకున్నారు.
ప్రజాపాలనలో తొలిరోజు.. దరఖాస్తు నిం పటమే దరఖాస్తుదారుడికి చిక్కుముడిలా మా రింది. అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలి? మొద లు అందులో ఉన్న ప్రతి అంశం సవాల్గా మారింది. ఆరు గ్యారెంటీల్లో ఏ పథకానికి అ ర్హులు, సరైన విధి విధానాలు పొందుపర్చకుం డా ఆధార్ కార్డు, రేషన్ కార్డు మెలిక ఒకవైపు, దరఖాస్తుఫారాలు ఇవ్వకుండా దరఖాస్తు చేసుకోవాలా? అన్న ప్రశ్నలతో ప్రజల్లో ఆందోళన కనిపించింది. రేషన్ కార్డు ఉన్నదా? ఆధార్ కా ర్డులో అడ్రస్ ఇక్కడే ఉన్నదా? రేషన్ కార్డు లేకుంటే స్కీమ్స్ రావు.. రేషన్ కార్డు కోసం తెల్లకాగితంలో రాసివ్వండి.. ఒక కుటుంబం లో ఒకటే స్కీమ్.. అంటూ దరఖాస్తుదారులకు అధికారులు చుక్కలు చూపించారు. దరఖాస్తులు ఎలా నింపాలో, రేషన్కార్డుల కోసం ఎవర్ని అడగాలో తెలియక అయోమయానికి గురయ్యారు. ఏ పథకానికి ఏ అర్హత ఉంటుందో? ఎలా ఎంపిక చేస్తారో? అన్న గైడ్లైన్స్ ఇవ్వకుండా దరఖాస్తులను తీసుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తున్నది.