హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ సాగుచేపట్టే రైతులకు విసృ్తత సమాచారం అందించేందుకు మొబైల్యాప్ రూపొందిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఆయిల్పామ్తో నాలుగు నుంచి ఐదు రెట్లు లాభాలు వస్తాయని పేర్కొన్నారు. ఆయిల్పామ్ను రా ష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో సాగుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది ఐదులక్షల ఎకరాల్లో ప్లాంటేషన్ చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారని వివరించారు. గురువారం ఆర్థిక, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యానవనశాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లను బడ్జెట్లో కేటాయించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం 1,85,000 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. స మావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్, ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారు.
ఆక్వాకల్చర్ అభివృద్ధికి చర్యలు
రాష్ట్రంలో ఆక్వాకల్చర్(చేపల పెంపకం)ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. గురువారం మత్స్యశాఖపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. మూడేండ్లలో ఐదు లక్షల ఎకరాల్లో ఆక్వాకల్చర్ అభివృద్ధికి సంబంధించి బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలిదశలో నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, గద్వాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఆక్వాకల్చర్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని సూచించారు.