హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి బుధవారం కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన శ్రీనాథ్రెడ్డి పలు ప్రముఖ తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో పని చేశారు. ఉన్నత హోదాల్లో విధులను నిర్వర్తించారు. దాదాపు 40 ఏండ్ల పాటు పాత్రికేయ రంగంలో విశేష సేవలను అందించారు. 2019లో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమితులుగా మూడేండ్ల పాటు సేవలు అందించారు. ఆయన మృతికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం వ్యక్తం చేశారు.