హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్సార్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియోకాల్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండ్రోజుల క్రితం ఎంపీ మాధవ్.. ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ.. దుస్తులు లేకుండా ఉన్న చిత్రాలను ఆమెకు చూపించడంతో ఆమె సీరియస్గా తీసుకొని వైరల్ చేసినట్టుగా ప్రచారం జరుగుతున్నది.
ఈ వీడియోపై గురువారం మాధవ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తాను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని అన్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. కాగా, ఎంపీ మాధవ్పై వచ్చిన ఆరోపణలపై ఏపీ సర్కారు విచారణకు ఆదేశించింది.