హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకొనే పార్టీ బీఆర్ఎస్ అని, తమ అధినాయకుడు, సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకొంటారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఏపీ నుంచి వచ్చిన కొంతమంది నేతలు సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్లడం, పార్టీలో చేరికలు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అక్కడి ప్రజలకు వివరించాలని సూచించారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల బలం బీఆర్ఎస్కు ఉన్నదని చెప్పారు. మంత్రిని కలిసివారిలో కొణిజేటి ఆదినారాయణ, సూర్య, ఆనంద్, మురళి తదితరులు ఉన్నారు.