హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : ఏపీలో గ్రూప్-2 దరఖాస్తుల గడువు ఈ నెల 17 వరకు పొడిగించినట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటించింది. సర్వర్ సమస్య కారణంగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది.
ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ఏపీపీఎస్సీ స్పష్టంచేసింది.