హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఆకాంక్షిస్తూ తిరుమల శ్రీవారికి ఏపీ బీఆర్ఎస్ నేత ఆరాట్ కృష్ణప్రసాద్ పూజలు చేశారు.
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్తోపాటు పార్టీ కార్యకర్తలు శ్రీవారికి 101 కొబ్బరికాయలు కొట్టారు. తెలంగాణలో స్థిరపడ్డ ఏపీ ప్రజలు, రాష్ట్ర ప్రజానీకం యావత్తు బీఆర్ఎస్కు మద్దతు తెలిపి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు. కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే మాడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.