హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వానికి ఆయన రిపోర్టు చేశారు. సీనియర్ అధికారి అయిన సోమేశ్కు ఏపీ సర్కారు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా, ఏపీ సర్కారు ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ తెలుగు రాష్ర్టాల్లో జరుగుతున్నది.