హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై నిరంకుశదాడికి నిరసనగా, నీట్ పేపర్ లీకేజీకి బా ధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న 21మంది విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలనే డిమాండ్తో లెఫ్ట్ విద్యార్థి సంఘాలు శుక్రవారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి.
ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్, ఏఐపీఎస్యూ, ఏఐఎస్బీల ఆధ్వర్యంలో జరిగే బంద్లో భాగంగా ఉదయం 11గంటలకు నారాయణగూడ చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ ఉంటుందని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. బంద్ నేపథ్యంలో పీజీ సెమిస్టర్ పరీక్షలను ఓయూ, మహాత్మాగాంధీ, శాతవాహన, టీయూ, జేఎన్టీయూ, కాళోజీ యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేశారు.