Yadadri | యాదాద్రి కలెక్టరేట్లో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. ఏఈవో మనోజ్పై ఏవో శిల్ప కతితో దాడికి పాల్పడింది. కత్తితో దాడి చేయడంతో మనోజ్కు మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఏఈవో మనోజ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఏవో శిల్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కత్తిపోట్లకు కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.