ధర్మసాగర్, జూలై 10: పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి నిరుద్యోగులకు సూచించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అనురాగ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు 60 రోజులపాటు నిర్వహించిన ఉచిత కోచింగ్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు రెండు నెలలపాటు అన్ని రకాల సౌకర్యాలతో ఉచిత కోచింగ్ పూర్తి చేశామని పేర్కొన్నారు. స్టడీ మెటీరియల్తో ఇంటి వద్ద చదువుకొని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. జీవితంలో ఉన్నతులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, హనుమకొండ, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్లు సుధీర్ కుమార్, పాగాల సంపత్రెడ్డి పాల్గొన్నారు.