హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా తొలిసారి ఆదివాసీ మహిళ ప్రొఫెసర్ జీ అనూరాధ నియమితులయ్యారు. బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. 115 ఏండ్ల కళాశాల చరిత్రలో ఆదివాసీ మహిళ ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించడం విశేషం. అనూరాధ ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె.