వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 19: కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్తోపాటు దాడికి పాల్పడిన ఘటనపై కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ మంగళవారం విచారణ జరిపింది. ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థి, రాజస్థాన్కు చెందిన మనోహర్ సాలం (2022 బ్యాచ్)పై ఈనెల 14న రాత్రి సీనియర్ విద్యార్థులు (2021 బ్యాచ్) అభినవ్ మోరే, సిల్వ శ్రీహరి, శ్రీచరణ్, సూర్యప్రకాశ్, లోకేశ్, సాయికిరణ్, హరికృష్ణ ర్యాగింగ్కు పాల్పడ్డారని, మనోహర్ ఎదురు తిరగడంతో దాడి చేశారని యాంటీ ర్యాగింగ్ కమిటీ తేల్చింది.
సీనియర్ విద్యార్థులను మూడు నెలలపాటు కళాశాల తరగతులు, ఏడాదిపాటు హాస్టల్ వసతిని రద్దు చేస్తున్నట్టు తీర్మానించింది. బాధితుడి ఫిర్యాదుతో ఏడుగురు సీనియర్ విద్యార్థులపై పోలీసులు 294-బీ, 232, 340 సెక్షన్లతోపాటు ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.