మహబూబాబాద్ : రైతుబంధుతో పల్లెల్లో ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతు బంధు సంబురాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొన్నారు.
వారోత్సవాలో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకావడతో రైతులు స్వచ్ఛందంగా పాల్గొని వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు.