హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): చేనేత, జౌళి రంగాలకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలకు సకాలంలో నిధు లు విడుదల చేయాలని, కేంద్రం నుంచి అందాల్సిన నిధులను రాబట్టేలా కృషి చేయాలని, చేనేత పరిశ్రమలకు భారీగా పెట్టుబడులు వచ్చేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. చేనేత డిజైనింగ్, శిక్షణ, ఉత్పత్తి, మారెటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోచంపల్లి, గద్వాలలోని చేనేత పరిశ్రమల వివరాలతో కూడిన నివేదికను తనకు అందించాలని కోరారు. వరంగల్ టెక్స్టైల్ పార్ను గ్రీన్పార్గా తీర్చిదిద్దేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.