హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు తీయనున్నది. కాచిగూడ-బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 24న ఉదయం 10.45 గంటలకు వర్చువల్గా ప్రారంభించనున్నారు. మొత్తం 8 బోగీలు ఉండే ఈ రైలులో 7 చైర్కార్ కోచ్లను, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ను ఏర్పాటు చేశారు. మొత్తం 530 సీట్లు ఉండే ఈ రైలులో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించారు.