హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): తిరుపతి ఎస్వీ జూపార్కులో రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ మృతి ఘనటకు ముందు అతని మరో నిర్వాకం బట్టబయలైంది. జూపార్కుకు రాకమునుపు ప్రహ్లాద్ గుజ్జర్ తిరుపతిలోని హథీరాంజీ మఠానికి చెందిన వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లాడు. అకడి సిబ్బందితో గొడవపడి వారిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఆలయానికి వెళ్లిన గుజ్జర్ స్వామిదర్శనం కోసం నేరుగా క్యూలైన్లో వెళ్లాడు. దర్శనానికి టోకెన్ తీసుకోవాలని సిబ్బంది చెప్పడంతో వారితో గొడవపడ్డాడు. టోకెన్లు జారీచేసే యంత్రాలను మఠం సిబ్బందిపై విసిరేశాడు. చిన్నపాటి ఆయుధంతో తోటి భక్తులను, సిబ్బందిని బెదిరించాడు. దీంతో కొంతమంది ధైర్యం చేసి అతన్ని చుట్టుముట్టి బంధించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో అతను గంజాయి సేవించినట్టు అకడివారు గుర్తించారని సమాచారం. జూపార్కుకు వెళ్లిన ప్రహ్లాద్ ప్రమాద హెచ్చరికలను లెక చేయకుండా తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎకి లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత వాటర్ ట్యాంక్ మీదుగా సింహాల ఎన్క్లోజర్లోకి దూకాడు. అకడే ఉన్న సింహం ప్రహ్లాద్ మెడ భాగంలో కొరికి అతన్ని చంపేసింది.