చార్మినార్, జూన్ 5: రోడ్డుపై నడుస్తున్న బాలికను అడ్డగించి, కారులో ఎక్కించుకొని స్నేహితుడితో కలిసి లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూ సింది. మొఘల్పురాకు చెందిన బాలిక గత నెల 31న సాయంత్రం 6 గంటలకు పహడీ షరీఫ్లోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. లాల్దర్వాజా క్రాస్ రోడ్డు మీదుగా చాంద్రాయణగుట్టకు చేరుకొన్నది. ఒంటరిగా ఉన్న బాలికను చూసిన క్యాబ్ డ్రైవర్ కలీం అలీ (36) ఎక్కడికి వెళ్లాలని ఆరాతీశాడు. తాను కూడా పహడీషరీఫ్లోనే ఉంటానని నమ్మించి కారులో ఎక్కించుకొన్నాడు. కొంత దూరం వెళ్లాక తన స్నేహితుడు లుక్మిన్ (36)కు ఫోన్ చేసి దక్కన్ ప్యాలెస్ వద్దకు రమ్మని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆమెను కొందుర్గ్కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 1న తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆమెను తీసుకొచ్చి మొఘల్పురాలో వదిలేశారు. అదే రోజు బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. వారిపై కిడ్నాప్, పోక్సో కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మానసికంగా కుంగిపోతున్న బాలికకు భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇప్పించినట్టు పోలీసులు తెలిపారు.