హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం తెలంగాణకు దూరంగా వెళ్లిపోయినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ర్టానికి భారీ వర్షాల ముప్పు తప్పిందని పేర్కొన్నది.
ఈ నెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. దీని ప్రభావం వల్ల ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.