వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇక్కడ శనివారం నాడు 17 మంది విద్యార్థులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరిగిపోతున్నాయి. బిహార్ వంటి రాష్ట్రాల్లో మూడో వేవ్ మొదలైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులే ప్రకటించారు. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా పంజాబ్లో కూడా కరోనాతో ఆస్పత్రిపాలై ఆక్సిజన్ అవసరమైన పేషెంట్ల సంఖ్య 250 శాతంపైగా పెరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఈ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కరోనా మూడో వేవ్ వచ్చినా తట్టుకునేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.