హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చొరవతో డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విభాగం.. మరో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటుచేసింది.
ఇప్పటివరకు ఇలాంటి సెంటర్ గోదావరిఖనిలో ఉండగా, తాజాగా హైదరాబాద్లోని ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వీఎస్ రావు, ఎండీ ఫసియుద్దీన్, నేతలు వెంకట్రామయ్య, బీ మహేశ్, ఎం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.