పెన్పహాడ్, మార్చి 14 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని నాగులపహాడ్లో గురువారం జరిగింది. నారాయణగూడేనికి చెందిన నారాయణ లింగారెడ్డి (55) నాగులపహాడ్ రెవెన్యూ శివారులోని తన వ్యవసాయ బావి మోటర్కు అంతరాయం ఏర్పడటంతో దానికి సంబంధించిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్-ఆన్ చేయబోయాడు.
ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన హెచ్టీ బ్లేడ్స్ వద్ద తీగలు మెలితిరిగి ఉండటంతో ఆన్ ఆఫ్ రాడ్కు వేలాడుతున్న తీగలు తగలడంతో లింగారెడ్డి విద్యుత్తు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం దగ్గరికి వెళ్లిన లింగారెడ్డి రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా ట్రాన్స్ఫార్మర్ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల రైతులు ఆరోపించారు. లింగారెడ్డికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.