హైదరాబాద్: సూర్యాపేటలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ (BRS )లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన కౌన్సిలర్ విక్రమ్ బాటలోనే మరో కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మ సాగర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagdish reddy) సమక్షం లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి, ఐఎన్టీయూసీ జాతీయ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రషీద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, పట్టణ నాయకులు జమాల్ బాబా, పుట్ట రవీందర్ రెడ్డి, అమర్నాథరెడ్డి తో పాటు పలువురు చేరారు.
వీరి బాట లోనే మరి కొంత మంది కాంగ్రెస్ , బీజేపీలకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు బీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్లు జహీర్, మడిపల్లి విక్రమ్, నాయకులు బైరు వెంకన్న, గుడిపుడి వెంకటేశ్వర రావు, సయ్యద్ సలీం, మీలా వంశీ, బైరబోయిన శ్రీనివాస్, పల్స వెంకన్న పాల్గొన్నారు.