హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తిరుమల అలిపిరి కాలిబాటలో మరో చిరుత చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఇది చిక్కినట్టు అధికారులు చెప్పారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత చిక్కింది. దీంతో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్టు వెల్లడించారు.
చిరుతను జూపార్క్కు తరలించేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా లక్షితను చంపిన చిరుతను గుర్తించేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పట్టుబడిన చిరుతల్లో రెండింటిపై పరీక్షలు నిర్వహించిన అధికారులు వాటిల్లో లక్షితను చంపిన చిరుత లేదని ప్రకటించారు.