హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ) : సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ (సీసీఎంబీ)ని సందర్శించేందుకు మరోసారి అవకాశం రానున్నది. ఆగస్టు 1 నుంచి 5 వరకు సీసీఎంబీ, అనుబంధ సంస్థలను విజిటింగ్ కోసం ‘వన్ వీక్ వన్ ల్యాబ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సైన్స్ టీచర్లు, రైతులు, విద్యార్థులు https://e-portal.ccmb.res.in/slotbooking_owol/booking.php ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
2న టెక్నాలజీ షో సైన్స్ టీచర్లకు తొలిసారిగా సీసీఎంబీ డెవలప్ చేసిన ఎడ్యుకేషన్ కిట్లతో వర్క్షాప్ నిర్వహించనున్నారు. 3న సీసీఎంబీ అభివృద్ధి చేసిన వరి వంగడాలపై, 4న కాలేజీ స్టూడెంట్లతో, 5న ప్రతినిధులకు జంతు శాస్త్రం, వన్యప్రాణులపై అవగాహన కల్పించనున్నారు.