హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): అవయవ మార్పిడిలతో వందలాది మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న తెలంగాణ జీవన్దాన్కు మరో అవార్డు వరించింది. అవయవ సేకరణ, మార్పిడి ప్రక్రియలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది. ఢిల్లీలో జరిగిన ఆరోగ్య సదస్సులో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా నిమ్స్ దవాఖాన నెఫ్రాలజి విభాగం ప్రొఫెసర్, జీవన్దాన్ ఇన్చార్జ్ డాక్టర్ స్వర్ణలత ‘1వ టెలివిజన్ ఆరోగ్య సుశ్రుత-2024’ అవార్డు అందుకొన్నారు. ఈ మేరకు డాక్టర్ స్వర్ణలతను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డీన్ డాక్టర్ లీజా రాజశేఖర్ అభినందించారు.