కరీంనగర్ : మానేరు లోయర్ డ్యామ్ దిగువన నిర్మించతలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్కు భారీగా నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ తీగల వంతెన వద్ద టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాగా, లోయర్ మానేరు నదిని సుందరీకరించడం, పటిష్టపరచడం కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా.. నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను 310.464 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో కాపీని సీఎం కేసీఆర్ స్వయంగా తన చేతుల మీదుగా మంత్రి గంగుల కమలాకర్ కు, శుక్రవారం ప్రగతి భవన్ లో అందచేశారు.