నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 7: బడ్జెట్లో వివిధ పథకాలకు నిధుల కేటాయింపులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. చారిత్రక నిర్ణయాలు ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. ధూపదీప నైవేద్య పథకంలో మరో 1,467 ఆలయాలను చేర్చడం, బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలకు రూ.177 కోట్లు కేటాయించడంపై బ్రాహ్మణ సంఘాలు సంతోషం వ్యక్తంచేశాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.