ఆదిలాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): ప్రగతి పథంలో దూసుకుపోతున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. మహారాష్ట్రలోని పుణెలో జరుగుతున్న రెండు రోజుల సమ్మేళనానికి ముక్రా(కే) సర్పంచ్ మీనాక్షి గాడ్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నా హజారే ఆమెకు ప్రసంశాపత్రం అందజేశారు. ప్రభుత్వ, ప్రజల సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నా హజారే పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తుండటంతో పల్లెలు ప్రగతిబాట పడుతున్నాయని సర్పంచ్ వివరించారు.