హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో ప్రస్తుత డీజీ గోవింద్.. అంజనీకుమార్కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భం గా అంజనీకుమార్ మాట్లాడుతూ.. తనను ఏసీబీ డీజీగా నియమించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన సమయం లో తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.