హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పై కత్తితో దాడి చేయడం అమానుషమని ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం(Anil Kurmachalam )తీవ్రంగా ఖండిచారు. వివాదరహితుడు, ప్రజల మనిషి, కనీసం ఎప్పుడు కూడా ఎవర్ని కోపంగా ఒక్క మాట అనని ప్రజా నాయకుడు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పై దాడి చెయ్యడం చాలా దారుణమన్నారు. ప్రజా స్వామ్యంలో ఇలాంటి హింసాత్మక దాడులకు చోటులేదని, దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి హింసాత్మక చర్యలకు పాలుపడలేదని, అలాంటి సంస్కృతి తెలంగాలో లేన్నారు. రాజకీయ అసహనంతో ఇలాంటి హింసాత్మక చర్యలని ప్రోత్సహిస్తునట్టు కనిపిస్తుందని, ఇలాంటివి ప్రాజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటివని, ప్రజలెవ్వరూ వీటిని సహించరని అనిల్ తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి త్వరగా కోలుకొని, ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.