Tomato | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): టమాటా రైతు దశమారింది. నిరుడు నష్టపోయిన ఆయనకు, నేడు ఏకంగా రూ.4 కోట్ల లాభం తెచ్చిపెట్టింది. ఈ అదృష్టం ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన మురళిని వరించింది. ఏటా టమాటాలు పండించే ఈయన, నిరుడు ధరలు లేక రూ.1.5 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. ఈసారి మంచి దిగుబడికి తోడు ధరలు బాగా ఉండటం కలిసివచ్చింది. గతంలో టమాటాలు అమ్మేందుకు 130 కి.మీ. దూరం వెళ్లేవాడినని, ఈసారి వ్యాపారులే తన తోట దగ్గరికి వచ్చి కొన్నారని రైతు తెలిపాడు. తనకు వచ్చిన లాభంతో అప్పులు తీర్చి, 20 ఎకరాల భూమి కొనాలని భావిస్తున్నట్టు చెప్పాడు.
మదనపల్లెలో టమాటా 196
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్లో టమాటా ధర చరిత్రలేనంతగా పెరిగింది. శనివారం మొదటి రకం కిలో టమాటా రూ.196 పలికింది. మారెట్కు కేవలం 253 టన్నుల సరకు మాత్రమే వచ్చింది. ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేకపోవడంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.