హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఏపీలో ఏడాదికాలంగా సైబర్ నేరాలు పెరిగాయని ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన 2022లో ఏపీలో జరిగిన నేరాలు, దోపిడీ, దొంగతనాలు, హత్యలు తదితర అంశాలను వివరించారు.
ఈ ఏడాది 2,700 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సైబర్ నేరాలు కాకుండా ఈ ఏడాది ఏపీలో క్రైం రేటు తగ్గిందని చెప్పారు. లోక్ అదాలత్లో 57 వేల కేసులను పరిష్కరించినట్టు డీజీపీ తెలిపారు. అత్యాచారాలు, హత్యకేసుల్లో 44 మంది నేరస్తులకు శిక్ష పడిందని, 88.5 శాతం కేసుల్లో చార్జిషీట్లు వేశామని డీజీపీ వివరించారు.