ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రరెడ్డి
ఖైరతాబాద్, జూన్ 23: కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత రాజకీయంలో ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వం అవసరమని ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పెల్లకూరు సురేంద్రరెడ్డి బీజేపీని ఎదిరించే ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను బలోపేతం చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ సర్కారు ఏపీనే కాకుండా దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నదని, దీనిపై ప్రశ్నించే నేతలు తమవద్ద లేరని అన్నారు.
కేంద్రం వివక్షపై పోరాడే నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని, ఆ పటిమ సీఎం కేసీఆర్లో ఉన్నదని, ఆయన నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని, అవసరమైతే పొత్తు పెట్టుకుంటామన్నారు. ఏపీ వాయిస్ కేంద్రంలో బలంగా వినిపించాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మట్టి, చెంబు నీళ్లు ఇచ్చి వెళ్లారు తప్ప బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. నాడు సమైక్యాంధ్ర అనే బోగస్ ఉద్యమ సమయంలో ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి మాత్రమేనన్నారు. 2001లోనే ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని చేపట్టామన్నారు. సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ యాదవ్, కార్యవర్గ సభ్యులు దయాకర్రెడ్డి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.