చిక్కడపల్లి, అక్టోబర్15: సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ కవి అందెశ్రీకి ప్రదానం చేశారు. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా వీసీ రవీందర్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆయనకు పురస్కారాన్ని అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్తేజ, కొత్త తెలంగాణ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్, సాహితీ విమర్శకుడు డాక్టర్ బెల్లి యాదయ్య, హైకోర్టు న్యాయవాది ఎం విప్లవ్కుమార్, రచ్చ భారతి, సుద్దాల సమ్రాట్, ఆర్ శశికాంత్, భూదేవి, రమణ తదితరులు పాల్గొన్నారు.