తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కృష్ణానదిలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. కృష్ణానదిపై ఉన్న వారధికి మరమ్మతులు చేస్తుండటంతో జనవరి 17 నుంచి ఎన్హెచ్ 167పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జి కింది నుంచి వెళ్తున్నవారికి సోమవారం నదిలో పురాతన విగ్రహాలు కనిపించాయి. గ్రామాల్లో నూతన విగ్రహ ప్రతిష్ఠించి పాత విగ్రహాలు, డ్యామేజ్ అయిన వాటిని తీసుకొచ్చి నదిలో వేస్తుంటారని పలువురు పండితులు తెలిపారు. -కృష్ణ