మూసాపేట (అడ్డ్డాకుల) ఏప్రిల్ 16: యూపీఎస్సీ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా మూడో ర్యాంకు సాధించడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దోనూరు మంజుల, సురేశ్రెడ్డిది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దమ్మాయి అనన్య. ఆమె మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ పాఠశాలలో ప్రాథమిక విద్య, కాకతీయ పాఠశాలలో ప్రాథమికోన్నత విద్య, గీతం పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది. హైదరాబాద్లోని హయత్నగర్ నారాయణ ఐఏఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది. ఢిల్లీలోని మిరిండా హౌస్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కళాశాలలో విద్యనభ్యసించించింది. అనన్యరెడ్డితోపాటు ఆమె తల్లిదండ్రులకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.
చిన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అయిన తాతయ్యతో మాట్లాడుతున్నప్పుడే భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనుకున్న. మా నాన్న సురేశ్రెడ్డి వ్యవసాయంతోపాటు బిజినెస్ చేస్తున్నారు. అమ్మ మంజుల గృహణి. డిగ్రీ నుంచే సివిల్స్ వైపు దృష్టి పెట్టాను. ఆంత్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్టుగా సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. ప్రతిరోజు 12 నుంచి 14 గంటలపాటు పుస్తకాలతో కుస్తీ పట్టాను. మంచి ర్యాంక్ సాధిస్తానని నమ్మకం ఉండేది. కానీ, మూడో ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. చిన్నప్పటి నుంచే సామాజిక సేవ చేయాలనే తపన ఉండటంతో సివిల్స్ వైపు అడుగులు వేశా. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఈ సక్సెస్ సాధ్యమైంది.
– అనన్యరెడ్డి, సివిల్స్ 3వ ర్యాంకర్